భీమ్ న్యూస్ ప్రతినిధి ఉండి (నవంబర్ 06) పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఆగిరిపల్లి లో లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా తోట వెంకటరత్న కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలోనే చనిపోయారు.. బలవంతంగా ఆగిరిపల్లి శిక్షణా కేంద్రంలో సుమారు 260 మంది ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లు శిక్షణకు హాజరైనారు. అక్కడ ఎలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉండలేదు. ఈరోజు ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో రత్న కుమార్ తీవ్ర అస్వస్థతకు గురవడం, వైద్య సహాయం అందుబాటులో లేకపోవడం… పక్కనున్న సహచర ప్రధానోపాధ్యాయులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కొద్దిసేపట్లోనే వారు మృతి చెందడం జరిగింది. తెల్లవారుజామున సంఘటన జరగడం, కొద్దిసేపట్లోనే మృతదేహాన్ని తరలించడంతో ఈ విషయం శిక్షణలో ఉన్న అత్యధిక మందికి తెలియలేదు. విషయం తెలిసిన తర్వాత ప్రధానోపాధ్యాయులు అందరు శిక్షణ తరగతులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అవసరం లేని ట్రైనింగులతో ప్రాణాలు తీస్తున్నారని తమ ఆవేదన వ్యక్తంచేశారు . శిక్షణ ఆపివేసి మండల కేంద్రం లొనే నాన్ – రెసిడెన్షియల్ పద్దతిలో శిక్షణలు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ మేరకు ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి.
లీడర్షిప్ ట్రైనింగ్ లో ప్రధానోపాధ్యాయుడు మృతి : ఫ్యాప్టో, ఉపాధ్యాయ సంఘాల నిరసన.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply