భీమ్ న్యూస్ ప్రతినిధి రాజానగరం (నవంబరు 07) ఏపీలో జిల్లాకేంద్రాలను వదిలి పెట్టి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ లీడర్షిప్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం తగదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని మల్లంపూడిలో సాయిమాధవి కళాశాలలో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు కొద్దిసేపు నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నాన్ రెసిడెన్షియల్తో పాటుగా శిక్షణా తరగతులకు పాఠశాల సమయాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లాల వారీ లీడర్షిప్ శిక్షణా తరగతులు నిర్వహించాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 50 సంవత్సరాలు పైబడి నవారిని, అనారోగ్యంతో బాధలు పడుతున్న వారిని శిక్షణ నుంచి మిన హాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా అగిరిపల్లిలో హీల్ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందుతూ ఆకస్మికంగా ఉండూరు హైస్కూల్ హెచ్ఎం టీవీ రత్న కుమార్ మృతిచెందడంతో ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయులు టీవీ రత్న కుమార్ మృతికి ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply