భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 12) ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది. బ్రాందీ షాపుల ముందు నిలబెట్టింది. బాత్రూముల ఫొటోలు కూడా తీయించి మరో రకంగా అవమానించింది. టీచర్ల ప్రతిష్ఠ, గౌరవం పెంచే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వారికి సమాజంలో ఉండే గౌరవం కొనసాగేలా చూస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం వాస్తవానికి సెప్టెంబరు 5నే జరగాల్సి ఉన్నా విజయవాడ వరదల కారణంగా వాయిదా పడిందన్నారు. దేశంలో ఐఐటీల వ్యవస్థకు నాంది పలికిన వ్యక్తి దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది. టీచర్లను వైసీపీ అవమానించింది! బ్రాందీ షాపుల ముందు నిలబెట్టింది. బాత్ రూముల ఫొటోలు తీయించింది. మేం వారి గౌరవ ప్రతిష్ఠలు పెంచుతాం. అన్ని విధాలుగా అండగా ఉంటాం. కూటమి విజయంలో వారి పాత్ర కూడా ఉంది. రాష్ట్రం నాలెడ్జ్ హబ్ కావాలి. ఒకప్పుడు నేనే జనాభా నియంత్రించాలన్నా.. ఇప్పుడు జన సంఖ్య పెరగాలి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం జరిగింది. ఆంగ్ల భాష మన విద్యార్థులకు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని, అలాగని మాతృభాష తెలుగును విస్మరిస్తే జాతి మనుగడ కష్టమవుతుందని చెప్పారు. అందువల్ల రెండు భాషలను సమతుల్యం చేసుకోవాలన్నారు. ఇక్కడ సాధారణ బడుల్లో చదివి నేడు అమెరికాలో అమెరికన్ల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు ఉన్నారంటే.. అందుకు గురువులే కారణమని చెప్పారు. టీడీపీ కూటమి 93 శాతం సీట్లతో విజయం సాధించిందంటే అందులో వారి పాత్ర కూడా ఉందన్నారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం మొత్తంగా 11 డీఎస్సీలు ఇచ్చింది. వాటిలో ఎనిమిదింటిని నేను సీఎంగా ఉండగా ఇచ్చాను. ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యాక తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టా. ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు సిగరెట్ ప్యాకెట్లపై టీచర్ల బదిలీలకు సిఫారసు చీటీలు రాసేవారు. ఆ అవమానాలు ఉండకూడదనే కౌన్సెలింగ్ విధానం ప్రవేశపెట్టాం. టీచర్లకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. భావి తరాలను వారు ఉన్నతంగా తీర్చిదిద్దాలి. వారు కూడా నిత్యం విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను రిక్షావాలా చెప్పినా దానిని ఎలా అమలుచేయాలనే కోణంలో ఆలోచిస్తూ నిత్య విద్యార్థిగా ఉంటాను’ అని తెలిపారు.
164 మందికి అవార్డులు.. ప్రధానం :
రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులు 164 మందికి దక్కాయి. వారిలో పాఠశాల విద్య టీచర్లు 68 మంది, జూనియల్ లెక్చరర్లు 25 మంది, ఉన్నత విద్యలో 55 మంది లెక్చరర్లు, సాంకేతిక విద్య లెక్చరర్లు 16 మంది ఉన్నారు. వీరితో పాటు ఈ ఏడాది రాష్ట్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఇద్దరికి కూడా అవార్డులు అందజేశారు. అవార్డు కింద రూ.20 వేల చెక్, మెడల్, ప్రశంసాపత్రం ఇచ్చారు.
మాజీ సీఎం జగన్ రాత్రిపూట ఆత్మల తో మాట్లాడి, తెల్లవారగానే అనాలోచిత నిర్ణయాలు తీసుకునేవారని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రధాన సభలో ఆయన మా ట్లాడుతూ.. ‘నేను కూడా సీబీఎ స్ఈ విద్యార్థినే. పరీక్షలు వస్తున్నాయంటే మా అమ్మ ఎక్కువ భయపడేది. ఇక్కడ కూడా సీబీఎ్సఈపై అంచనా కోసం పరీక్షలు నిర్వహిస్తే 90శాతానికి పైగా విద్యార్థులు ఫెయిలయ్యారు. టోఫెల్, ఐబీ అంటూ ఆచరణ సాధ్యంకాని సంస్కరణలు ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు వృథా చేశారు. చివరకు నా నెత్తిన రూ.6500 కోట్ల అప్పులు పెట్టి వెళ్లారు’ అని వ్యాఖ్యానించారు. మొదట తాను విద్యాశాఖ తీసుకున్నప్పుడు, ఇందులో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని శాఖ మార్చుకోవాలని చాలా మంది సలహాలిచ్చారని, కానీ సవాల్గా భావించి దీనిని తీసుకున్నానని చెప్పారు. ఐదేళ్లలో ఏపీ విద్యా విధానం అంటే ఇదీ అనుకునేలా మారుస్తామన్నారు. ‘నా బలం, బలగం టీచర్లే. వారు తలచుకుంటే ప్రైవే టు బడులు మూతపడిపోతాయి. శనివారం నో బ్యాగ్ డేగా ఉంచాలని నిర్ణయించామని’ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply