భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 20) ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం పొంచి ఉంది. రేపు దక్షిణ అండమాన్ పై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఈ నెల 23న అల్పపీడనంగా మారే అవకాశముందని చెప్పింది. అనంతరం రెండు రోజుల తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని కూడా తెలిపింది.
భారీ వర్షాలు పడతాయి:
ఈ అల్పపీడనం, వాయుగుండంగా మారి తర్వాత తుపాను గా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
Leave a Reply