భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం (డిసెంబర్ 07) ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం బాలికల, బాలుర హైస్కూల్లో, గార, సింగుపురం జడ్పీ హైస్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి వైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని, ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భాగ్యస్వామ్యం కావడంతో సమాజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికి తీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థిలను ఉన్నతంగా తీర్చిదియడమే లక్ష్యమన్నారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్ట వచ్చిందని చెప్పారు. పండగ వాతావరణం లో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతానికి, బడి బయట విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటలు పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply