భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (డిసెంబర్ 19) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట గురువారం సాయంత్రం సూళ్లూరుపేట బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వారసులు అయినటువంటి దళిత సంఘాల ఐక్యవేదిక నుండి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా మూమెంట్ 21 కన్వీనర్ అక్కరపాక చంద్రశేఖర్ మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఢిల్లీ రాజ్యసభ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అవహేళన చేస్తూ మాట్లాడటం అనేది భారతదేశానికి తల వంపులుగా మాట్లాడారని దీని విషయంలో అమిత్షాను అట్రాసిటీ చట్టం ద్వారా అరెస్టు చేయాలని ఆయన పై అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని భారత రాజ్యాంగంలో ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతులు కాదని అదే భారత రాజ్యాంగంపై ప్రమాణం స్వీకారం చేసి అదే భారత రాజ్యాంగమును అమలు చేయాల్సినటువంటి కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి విధానం కూడా కాదని చట్టసభలో మాట్లాడడం ద్వారా ఇది భారతదేశానికి తలవంపులుగా ఉందని భారతదేశ ప్రజలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిదీ గమనిస్తున్నారని ప్రభుత్వం నుండి ఆయనను భర్తరఫ్ చేయాలని లేదంటే అమీషా తనంతట తానుగా పదవికి రాజీనామా చేయాలని ప్రజా సంఘ నేతలు పెద్ద ఎత్తున సులూరుపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్నాంబాకం మున స్వామి, లాయర్ విజయమ్మ, కన్నం భాగం హరికృష్ణ, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి ఇంగిలాల ఆనంద్ పిట్ల, చిన్న వేనాటి చంగయ్య తదితర నాయకులు పాల్గొని నిరసన తెలియజేశారు. అమిత్ షా రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తాం అని తెలియజేసారు. బి జే పి పార్టీ పైన అమిత్ షా పైన వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.
అమిత్ షా ను వెంటనే అరెస్టు చేయాలి : దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply