భీమ్ న్యూస్ ప్రతినిధి పలాస (డిసెంబర్ 21) శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ప్రగతి భవన్ లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలాస వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ లో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం అతని తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి పార్టీ పెట్టి ముందుకు సాగకపోతే ఈ రాష్ట్రానికి అధోగతి పట్టేదని, తాను పార్టీ పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని మంత్రి డాక్టర్ సీదిరి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని, అధికారులకు కూర్చోవడానికి కనీసం కుర్చీ లేని పరిస్థితుల నుంచి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించామని, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఫిషింగ్ హార్బర్స్, వాటర్ ప్రాజెక్ట్స్ వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, కానీ నేడు దురదృష్టవశాత్తు ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చిందని, నీచ నికృష్టమైన పరిపాలనలో ప్రజలు నేడు నానా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రతీ గ్రామంలో మనందరం కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలను గురించి మాట్లాడాలని, గతంలో మన ప్రభుత్వం హయాంలో మహిళలు ఎలా గౌరవంగా, సంతోషంగా కుటుంబాన్ని ఆర్థికంగా హాపీ గా నెట్టికోచ్చారని, కానీ నేడు ఆ సంతోషం మహిళల ముఖాలలో లేదని, విద్యుత్ చార్జీలతో పాటు నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధరలు కూడా ఈ ప్రభుత్వం ఆరు నెలలు తిరగకుండానే పెంచుకుంటూ వచ్చిందని, ఇది పేద ప్రజలను ముంచే ప్రభుత్వం అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అబద్ధపు హామీలు ఇవ్వడం చేతకాదని, ఏదైతే చెబుతారో అదే చేస్తాడని, కానీ చంద్రబాబు నాయుడు అలా కాదని ఆరు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మబ్బిపెట్టి అధికారంలోకి వచ్చాడని, ఇవన్నీ చేయడానికి ఖజానాలో డబ్బులు లేవని, గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు లక్షలు కోట్లు అప్పు ఉందని, దానిని వడ్డీతో సహా సంపద సృష్టించి తీర్చుతానని చంద్రబాబు నాయుడు అన్నారని, ఒకవేళ అంత అప్పు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేసినప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అప్పు ఆరు లక్షల కోట్ల అని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి ఇంత తక్కువ అప్పు ఉన్నప్పుడు ఎందుకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ఇది ప్రజల మాట అని, చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ప్రజలు రోడ్లపైన మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగుతాయని, అన్ని విభాగాలను మండల స్ధాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నియమించడం జరుగుతుందని వివరించారు. మరలా మనం అధికారంలోకి తిరిగి వస్తామని, ప్రతీ ఒక్కరికీ ఉన్నతమైన స్థానం కల్పించడం జరిగిందని, కార్యకర్తలను కలవడానికి జగన్మోహన్ రెడ్డి మన నియోజకవర్గం రావడం జరుగుతుందని, మనందరం సమిష్టిగా కసి పని చేయాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాలు మరియు మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో సీదిరి అప్పలరాజు.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply