భీమ్ న్యూస్ ప్రతినిధి భీమవరం (జనవరి 04) ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి మతోన్మాద ముప్పు పొంచి ఉందని, దానిని తిప్పికొట్టాలని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు అన్నారు. భీమవరంలో అమరజీవి రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్ఎస్) నగర్ (ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం)లో వలవల శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా 26వ మహాసభలో ప్రతినిధుల సభను వి.ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నడుస్తోన్న ఎన్డిఎ పాలన రాజకీయాలను కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలో 37 కోట్ల మంది రెండు పూటలా తిండి తినే స్థితి లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయని, ఇది దేశంలోని అసమానతలను సూచిస్తోందని తెలిపారు. అంబాని, అదాని వంటి కార్పొరేట్ శక్తులు మోడీకి భజనపరులుగా మారి విపరీతమైన ప్రయోజనాలు పొందుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రభావాన్ని గ్రహించినందునే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదాని లాంటి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమీ అనలేక పోతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్అంబేద్కర్పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం మనుగడ సాగించలేవని స్పష్టం చేశారు. 2025 నాటికి దేశంలో హిందూరాజ్య స్ధాపన జరపాలనేది హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ రూపొందించిన ప్రణాళిక అని, అందువల్లే జమిలి ఎన్నికలు జరపాలని చూస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను తన భాగస్వామ్యులైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో బిజెపి ప్రచారం చేయిస్తోందన్నారు. రాష్ట్రంలో కులాలవారీగా విభజన రాజకీయాలు నడుపుతున్నారని, మతం అనేది వ్యక్తిగతమని, దేశంలో అన్ని మతాలకు చెందిన వారు జీవిస్తున్నందున అందరూ మత సామరస్యం కోసం కృషి చేయాలని కోరారు. మహాసభ ప్రారంభ సూచకంగా అరుణ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు కేతా సూర్యారావు ఆవిష్కరించారు. ఈ మహాసభకు జెఎన్వి.గోపాలన్, చింతకాయల బాబూరావు, బురిడి వాసుదేవరావు, కేతా గోపాలన్, దూసి కల్యాణి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రాజకీయ నిర్మాణ నివేదికను జిల్లా కార్యదర్శి బి.బలరాం ప్రవేశ పెట్టారు. అంతకుముందు అమరవీరులకు, సంఘ సంస్కర్తలకు, ఇతరులకు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
దేశంలో 37 కోట్ల మందికి రెండు పూటలా తిండి తినే స్థితే లేదు: సిపిఐ(ఎం)

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply