భీమ్ న్యూస్ ప్రతినిధి కోట (జనవరి 08) పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఓ గృహోపకరణాల అమ్మకాలు కంపెనీ పండుగకు భలే ఆఫర్లు పెట్టి, డబ్బులు ముందస్తు జమ చేయించుకుని గోల్ మాల్ చేసి చెక్కేసిన ఘటన తిరుపతి జిల్లా కోట మండలం కోటలో జరిగింది. బాధితులు ఇచ్చిన వివరాల మేరకు కోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఆర్.ఆర్. ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో గృహోపకరణాలను అమ్మకాలు చేసే దుకాణం ఒకటి ప్రారంభం చేశారు. ముందుగా కొంత మొత్తం డబ్బులు కడితే ఆఫర్లలో సగం ధరకే వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు గృహోపకరణాలు కోసం పెద్ద ఎత్తున సొమ్ము జమ చేశారు. ఇంకేముంది అందిన కాడికి సొమ్ము వసూలు చేసిన సదరు షాపు యాజమాన్యం ఉడాయించింది. విషయం బయటకు పొక్కడంతో బాధితులు షాపు దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులు చెప్పిన వివరాలను విని ప్రజలనే తప్పుబట్టారు. పోలీసులు తమకు న్యాయం చేస్తారని ఆశించిన ప్రజలకు పోలీసుల మాటలకు మతి పోయింది. విస్తుపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు. ఓ పక్క పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు రకాలుగా అవగాహనలు కల్పిస్తున్నా గానీ ప్రజల ఆశను అసరాగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు అందినకాడికి దండుకుని ఆపై బోర్డు తిప్పేస్తున్నారు.
పండుగకు భలే ఆఫర్స్ – గోల్ మాల్ గోవిందం ట్రేడర్స్

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply