భీమ్ న్యూస్ ప్రతినిధి టెక్కలి (జనవరి 09) ఆడపిల్లలని రక్షిద్దాం, ఆడపిల్లలని చదవనిద్దాం. అనే నినాదంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాకిపల్లిలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం. అనురాధ ఆధ్వర్యంలో కేస్ వర్కర్ కుప్పిలి ప్రసన్నరాణి వన్ స్టాప్ సెంటర్ల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు సమాజంలో మహిళలు, ఆడపిల్లలను చదివించడంతో పాటు, వారి స్వీయ రక్షణకై – విద్యార్థినులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సురక్షిత స్పర్శ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, గృహ హింస, మానవ అక్రమ రవాణా, అత్యాచారాలు వంటి పలు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. నిరాశ్రయులు అయిన ఆడపిల్లలకు, మహిళలకు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ వారు నిర్వహిస్తున్న హోమ్స్ ఉన్నాయని తెలిపారు. ఆడపిల్లలకు మహిళలకు ఎటువంటి కష్టం కలిగిన 100,1098, 181,112 హెల్ప్ లైన్ నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్నహస్తంగా ఒన్స్టాప్ సెంటర్లు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం మహిళ కానిస్టేబుల్ ప్రమీల ఉపాధ్యాయులు కే. నారాయణరావు, పి. ఋషి, పి. చిన్నారావు, కే. మురళీకృష్ణ, ఆర్. జ్యోతి, కే. సుధారాణి, మోహిని, బాడాన నారాయణరావు, రమేష్ పాల్గొన్నారు.
విద్యార్థినులకు చట్టాలపై అవగాహన సదస్సు

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply