భీమ్ న్యూస్ అమరావతి (జనవరి 12) ఏపీలో ప్రస్తుతం ఉన్న స్కూల్ కాంప్లెక్స్ల రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విద్యాశాఖ అనాలోచిత చర్యలు వల్ల 5 వేల కాంప్లెక్స్ల స్థానంలో 4,034 క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నారు.1225 మంది సీఆర్పిల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సీఆర్పీలు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 5,200 స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో 4,034 క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి క్లస్టర్కు గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కి.మీ. పరిధిలో ఉన్న 10 నుంచి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు.
దీంతోపాటు క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఇకపై ప్రతి నెలా పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యావ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు క్లస్టర్ కేంద్రంగా నిర్వహిస్తారు.
ఎంఈవో అధికారాలు క్లస్టర్ హెచ్ఎంకు :
కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు. మండల యూనిట్లో ప్రస్తుతం డీడీవో అధికారాలు ఎంఈవోలకు ఉండగా.. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ హెచ్ఎంకు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు. ఎంఈవోలు కేవలం పరిపాలన సంబంధ అంశాలకు మాత్రమే పరిమితం కానున్నారు. క్లస్టర్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడడంతోపాటు ఎంఈవోలు నిర్వహిస్తున్న డీడీవో బాధ్యతలను కూడా క్లస్టర్ హెచ్ఎంకే ఇవ్వనున్నట్టు సమాచారం.
స్కూల్ కాంప్లెక్స్ను బలోపేతం :
కొత్తగా పునర్వ్యవస్థీకరణ చేసిన స్కూల్ క్లస్టర్ కేంద్రాలను బలోపేతం చేస్తూ గ్రాంటు రూ.లక్ష వరకు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. పాఠశాలల సంఖ్యను పెంచినందున ఇద్దరు చొప్పున సీఆర్పిలను కేటాయించాలని కోరారు.
1225 మంది సీఆర్పిలపై ప్రభావం :
ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్లను తగ్గిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను కూడా తగ్గిస్తోంది. రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో 4,100 మంది సీఆర్పిలుగా పనిచేస్తుండగా.. ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కూల్ కాంప్లెక్స్ల పునరి్నర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం జూలైలో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.ఇందులో భాగంగా ఒక్కో మండలంలో రెండు స్కూల్ కాంప్లెక్స్లను ఒక్కటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్ల సంఖ్యకు అనుగుణంగా సీఆర్పిలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలం పరిధిని బట్టి 8 నుంచి 10 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్ను కాంప్లెక్స్గా, మండలంలో మొత్తం 4 నుంచి 6 కాంప్లెక్స్లు కొనసాగుతున్నాయి. ఆయా స్కూళ్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంబంధ పథకాలు, విద్యా కేలండర్, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సీఆర్పీలు పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈవోల ద్వారా నివేదిక అందిస్తారు.
కాంట్రాక్టు విధానంలో నియమితులైన వీరంతా బీఈడీ అర్హత ఉండడంతో గత ప్రభుత్వం సీఆర్పీలు/ క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్ఎంటీ) లు గా గుర్తింపు ఇవ్వడంతో పాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్నదానిపై ఇప్పటి దాకా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఏపీలో సీఆర్పీల విధులు ఇప్పటివరకు …
యాక్సెస్ & నిలుపుదల : పాఠశాలలు తెరవడం సాధ్యంకాని లేదా స్థూల యాక్సెస్ నిష్పత్తి తక్కువగా ఉన్న తక్కువ జనాభా ఉన్న మారుమూల నివాసాలలో పిల్లలకు సెకండరీ స్థాయి (X తరగతి) వరకు పాఠశాలలో నిలుపుదల, రవాణా / ఎస్కార్ట్ సౌకర్యం కోసం ఏర్పాటు కు కృషి
నాడు- నేడు పనులు వేగవంతంగా : సమగ్ర శిక్ష అన్ని ప్రభుత్వాలకు అమలు చేయబడుతుంది. నిర్వహణ పాఠశాలలు అదనపు తరగతి గదులు మరియు బాలురు మరియు బాలికల మరుగుదొడ్లు.
బడి బయట పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ప్రోత్సాహం : ఎలిమెంటరీ స్థాయిలో బడి బయట పిల్లల (OoSC) వయస్సు తగిన ప్రవేశాలు.
జగనన్న విద్యా కానుక పథకం అమలు : రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 7 వస్తువులతో కూడిన ఈ ప్రత్యేక JVK కిట్లను పంపిణీ చేసింది. 3 జతల యూనిఫారాలు: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న ప్రతి విద్యార్థికి వారి ఫిట్ సైజు ప్రకారం 3 జతల స్కూల్ యూనిఫాం అందజేయబడుతుంది.
పేరెంట్ కమిటీల శిక్షణ (PCలు) : జిల్లాలోని విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అర్హత ఉన్న అన్ని పాఠశాలల్లో పేరెంట్ కమిటీలు (గతంలో SMCలుగా పిలువబడేవి) ఏర్పడ్డాయి. మాతృ కమిటీ సభ్యులకు వారి పాత్రలు మరియు బాధ్యతల గురించి సరియైన శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల అందించబడుతుంది, ఇది పాఠశాల స్థాయి కార్యకలాపాల ప్రణాళిక, ప్రణాళిక తయారీ, పర్యవేక్షణ మరియు పర్యవేక్షణలో వారి చురుకైన మరియు ప్రభావవంతమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో అత్యంత కీలకమైనది.
నాణ్యమైన విద్య : సమగ్ర శిక్ష అన్ని ప్రభుత్వ నిర్వహణకు నాణ్యమైన విద్య అందించబడుతుంది. క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ ఇంటర్వెన్షన్లోని పాఠశాలలు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరాసీ (FL&N), కాంపోజిట్ గ్రాంట్, పుస్తకాల కొనుగోలుతో సహా పాఠశాల లైబ్రరీలను బలోపేతం చేయడం, క్రీడలు మరియు శారీరక విద్య, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (RAA), DIKSHA (జాతీయ ఉపాధ్యాయ వేదిక), శిక్షణ సేవా ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ అధ్యాపకులు, విద్యాపరమైన మద్దతు ద్వారా BRC/CRC మరియు వృత్తి విద్యకు కృషి.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమగ్ర విద్యా సదుపాయం (CwSN): విద్యార్థులందరూ విద్యా వ్యవస్థలో అభివృద్ధి చెందగలిగేలా పూర్తి ఈక్విటీ మరియు చేరికను నిర్ధారించడానికి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు (CWSN) కేటాయింపు. వైకల్యాలున్న పిల్లల అభ్యాసానికి తోడ్పాటు అందించడం, ముందస్తు గుర్తింపు మరియు మద్దతుపై దృష్టి కేంద్రీకరిస్తుంది. పాఠశాల విద్యలో పూర్తిగా పాల్గొనేందుకు వికలాంగ విద్యార్థుల అవసరాల మ్యాపింగ్ చేయడం.
ఏకపాధ్యాయ / పాఠశాలకు డెప్యుటేషన్లు :
ఏకోపాధ్యాయ పాఠశాలలతో పాటు అన్ని పాఠశాలకు డెప్యుటేషన్లు వెళ్లడం.
పాఠశాలలకు మానిటరింగ్ :
తమ పరిధిలోని పాఠశాలలకు మానిటరింగ్ వెళ్లడం
మధ్యాహ్నం భోజనం పథకం అమలుకు కృషి :
సి ఆర్ పి లు తమ క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలకు కృషి చేయడం విద్యార్థులు సంతృప్తిగా భోజనాన్ని స్వీకరించి, పాఠశాలల్లో సమయాను కూలంగా ఉండడం కోసం కృషి చేయడం.
ప్రభుత్వపాఠశాలల్లో ప్రవేశాలుకు : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రవేశాలు చేయడం.
టీచ్ టూల్ పరిశీలన కార్యక్రమం : పాఠశాలలకు సంబంధించి టీచ్ టూల్ పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించడం.
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ :
క్లస్టర్ స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ మీటింగులకు ఉపాధ్యాయులందరినీ సమన్వయపరచి మీటింగ్లు ఏర్పాటు చేయడం బోధన సరళతరం చేయడం.
ఏది ఏమనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల సిఆర్పిలు గత 15 సంవత్సరాలుగా తమ వంతుగా పాఠశాల విద్యాశాఖకు తీవ్రమైన కృషి చేస్తూ ఏపీ విద్యా వ్యవస్థను ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు తీసుకోని నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుని సిఆర్పి వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నదని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో పూర్తిగా కోత విధింపబడుతుందని తర్వాత సీఆర్పి వ్యవస్థకు మంగళం పాడుతారని ధోరణి కనిపిస్తోందని విద్యాశాఖ విశ్లేషకులు, సీఆర్పీలు, తమ భవితవ్యం గాల్లో ఉందని తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.
Leave a Reply