భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (జనవరి 21)
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని రోసనూరు గ్రామంలో మంగళవారం బెల్ట్ షాపుల నియంత్రణ, సూపర్ సెక్స్ పథకాల ఫెయిల్యూర్ పై మహిళల పోరుబాటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెళ్లకూరు మండలం జడ్పిటిసి నన్నం ప్రిస్కిల్లా, వైస్ ఎంపీపీ సుధారాణి ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నివారణపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు, సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుచూ జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా రాణించారని, ప్రతినెల ప్రతి ఇంటిలో పండగ వాతావరణం ఉండేదని, కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో మనమందరం మోసపోయామని ఒక్క పెన్షన్ తప్ప, మహిళలకు ఉచిత బస్సు, అమ్మ ఒడి బదులు తల్లికి వందనం ఏమైపోయిందని, రైతులకు జగనన్న పాలనలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 13500 వారి అకౌంట్లో జమ అయ్యేదని, అంతేకాకుండా రైతుకు గిట్టుబాటు ధర బస్తా రూ.2400 నుండి 2500 వరకు ఉండి రైతులు సస్యశ్యామలంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం ప్రారంభంలోనే రూ.1400 మాత్రమే ఉందని ఆమె తెలిపారు. అనంతరం మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ పరిపాలన కాలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా లేవని ప్రస్తుతం గ్రామానికి సుమారు 10 షాపులు ఉన్నాయని, గ్రామాల్లో కాకుండా షాపులు దూరంగా ఉండటం వల్ల కష్టపడిన వారు అక్కడికెళ్లి తాగే శాతం తక్కువ ఉంటుందనీ అన్నారు. మద్యం షాపులు దగ్గరలో ఉన్నందువల్ల నిత్యం మద్యం సేవించి కుటుంబాలు వ్యవస్థ కుంటు పరుచుకుంటూ, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఆమె తెలిపారు. బెల్ట్ షాపులు నియంత్రణ కోసం మేము హైకోర్టులో ఫిల్ వేసామని అది మనకు అనుకూలంగా వచ్చిందని ఎవరైనా బెల్ట్ నిర్వహిస్తే ధైర్యంగా మాకు తెలియజేస్తే పోలీసు వారి ద్వారా తప్పక సమాచారం ఇస్తామని అన్నారు. ఏది ఏమైనా మండలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతూ ఉండడం విశేషం.
రోసనూరులో వైసిపి “మహిళల పోరు బాట” కార్యక్రమం

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply