భీమ్ న్యూస్ ప్రతినిధి కొత్తూరు (జనవరి 30) శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రజలు, ప్రయాణికులు సౌకర్యార్ధం 1995 సంవత్సరంలో నిర్మించిన ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ను 2024.05.04 నుండి 2034. 05.03 వరకు 10 ఏళ్ళు ప్రైవేటు వ్యక్తులకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు లీజు మంజూరు చేయటం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాలకు సరిహద్దు గ్రామంలో ప్రజలకు, ప్రయాణికులుకు నిలువ నీడ లేకుండా చేయటం దుర్మార్గమని, కొత్తూరు నుండి పలాస. పలాస నుండి మాతల. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని, ప్రైవేటు బస్సులు, ఒరిస్సా ఆర్టీసీ బస్సులు వస్తుంటాయని, ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వేచి ఉండే, ప్రభుత్వ ఆర్టీసీ కాంప్లెక్స్ ను, శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ అధికారులు 10 సం. లీజుకు ఇవ్వడాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని, ఆర్టీసీ కాంప్లెక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని, నివగాం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే కాంప్లెక్స్ ను స్ధానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రజలు, ప్రయాణికులు సౌకర్యార్ధం అధికారులు ఇచ్చిన లీజు రద్దు చేసి నివగాం ఆర్టీసీ అవును కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ లేకుంటే ప్రజలు మద్దతుతో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలవెల్లి రాంబాబు, పూర్ణచంద్ర పట్నాయక్, బి. చిన్నారావు, బూరాడ ధర్మారావు, సాన గోపాల్, ఉగాధి తదితరులు పాల్గొన్నారు.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply