భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి – తిరుమల (జనవరి 30) తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు శ్రీవారి భక్తులు గుర్తించారు. దీంతో భక్తులు వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించింది.
ఇటీవల, తిరుపతిలో చిరుత సంచారం కలకంల రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన మునికుమార్ తిరుమల అశ్విని ఆస్పత్రిలో ఎంఎన్వోగా పనిచేస్తున్నారు. అయితే అతడు జనవరి 11వ తేదీన వేదిక్ యూనివర్సిటీ సమీపంలో బైక్పై వెళ్తున్న సమయంలో చిరుత సంచారం గమనించాడు. దీంతో భయపడిన మునికుమార్ బైక్ నుంచి కిందపడ్డాడు. ఆ తర్వాత చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. మునికుమార్ను చికిత్స నిమ్తితం స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
Leave a Reply