భీమ్ న్యూస్ ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం (ఫిబ్రవరి 01) నెల్లూరు జిల్లా బుచ్చి మండలం విలియమ్స్ పేట గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందచేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు విచారించారు. వివిధ సమస్యలపై స్థానికులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శేష జీవితంలో అవ్వా తాతలకు ఆర్ధిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 3 వేలు వుండే పెన్షన్ మొత్తాన్ని 4 వేలకు పెంచారని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించే సామర్ధ్యం ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందన్నారు. దివ్యాంగులు సైతం మరొకరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకై గతంలో ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసి 6 వేలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా అప్పగించినా సంక్షేమ పధకాల అమలులో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఐదేళ్లకు సరిపడా సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ పల్లెలను ప్రగతి బాట పట్టిస్తుందన్నారు. సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామాలలో సమస్యలపై స్థానిక నాయకులు దృష్టి సారించాలని కోరారు. ఏ సమస్య వున్నా నేరుగా తనను సంప్రదించాలని నియోజకవర్గ ప్రజానీకానికి సూచించారు.
విలియమ్స్ పేట సమస్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ స్థానిక అంగన్వాడి సెంటర్ మరియు ప్రాధమిక పాఠశాలకు త్వరలో ప్రహారి గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా వుంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విలియమ్స్ పేట సమీపంలో వున్న బుచ్చి నగర పంచాయతికి చెందిన డంపింగ్ యార్డ్ ను వేరే చోటకి తరలించాలన్న స్థానికుల ఫిర్యాదుపై ఆమె స్పందిస్తూ వీలయితే వేరే చోటకు తరలించడమా లేదంటే డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహారి గోడ నిర్మించి స్థానికులకు అసౌకర్యం లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, ఎంపీడీఓ శ్రీహరి, తహసీల్దార్ అద్దంకి వెంకటేశ్వర్లు, టిడిపి రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎం.వి. శేషయ్య, టిడిపి నాయకులు పుట్ట సుబ్రహ్మణ్యం, యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డితో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply