భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (ఫిబ్రవరి 22) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వివాదాల మధ్య కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో కాలం అయింది. కానీ పరీక్ష మాత్రం వాయిదా పడుతూ వస్తుంది.అయితే గ్రూప్ 2కి సంబంధించి గతేడాదిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇక ఈ నెల అంటే ఫిబ్రవరి 23న మెయిన్స్ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. కానీ వివాదాలు మాత్రం సర్దుమనగలేదు.
APPSC కీలక ప్రకటన :
ఇప్పటికీ పలువురు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పోస్టు, జోనల్ ప్రిఫరెన్స్ తీసుకుంటామని తెలిపింది. గ్రూప్ 2 పోస్టులకు మెయిన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దీనికి అవకాశం ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. రిజల్ట్స్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేసేందుకు అవకాశం లేదని అర్థం అవుతోంది.
పరీక్షకు 92,250 మంది హాజరు :
మరోవైపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్నారు. ఈ పరీక్ష రెండు పూటలు జరగనుంది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ గ్రూపు -2(Group -2) పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది.ప్రస్తుత వాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ -2 నోటిఫికేషన్లో మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడాకారులు, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం తీర్పు వెలువరించింది.
Leave a Reply