భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు నగరం (ఫిబ్రవరి 22) చిత్తూరు జిల్లా, చిత్తూరు నగరంలో మహిళలు, యువత, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. వారి సమస్యలను సావధానంగా విన్నారు. శనివారం లక్ష్మీ నగర్ కాలనీ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్ లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాల వినతలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పరిధిలోని సమస్యలను నగరపాలక అధికారులు, రెవెన్యూ సమస్యలను తాహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అర్జీ పైన క్షేత్రస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే వారికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్థికపరం కాని వాటిని వేగంగా పూర్తిచేయాలని, ఆర్థికపరమైన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, ఎంపీడీవో కె. శ్రీనివాసులు, శివరాజ్, తహశీల్దార్లు లోకేశ్వరి, జయంతి, ఎంహెచ్వో డా. లోకేష్, ఎం.ఈ. వెంకట రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply