భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (ఫిబ్రవరి 28) రాష్ట్ర శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ.48,341.14 కోట్ల కేటాయింపులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయిస్తూ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కూడా వ్యవసాయ బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. ప్రాధాన్యత అంశాలు పరిశీలిస్తే, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు కేటాయింపు చేశారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.96.22 కోట్లు, సహకార శాఖకు రూ.239.85 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,112.07 కోట్లు, మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు, ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు, వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు, ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు, ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు, ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు, ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు, నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు కేటాయింపు చేశారు.
Leave a Reply