భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (మార్చి 07) తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగులు గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల ఫారెస్ట్ సిబ్బంది వాటిని ఘాట్రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకొని వాటిని పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్లేలా బెదరగొడుతున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు కూడా హెచ్చరికలు జారి చేశారు.
ఘాట్ రోడ్డులో గజరాజులు :
తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు అలర్ట్గా ఉండాలని టీటీడీ ప్రకటించింది. తిరుమల చుట్టూ శేషాచలం అడవి ప్రాంతం ఉండటంతో అక్కడ ఉండే పులులు, ఏనుగులు తరచూ ఘాట్ రోడ్డులో సంచరించడం చూశాం. తాజాగా గురువారం రాత్రి ఓ ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్డులోని ఏడోవ మైలు వద్ద బీభత్సం సృష్టించాయి. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి.
ఏనుగుల బీభత్సం :
గురువారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో ఏనుగుల మంద సంచరించినట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది,విజిలెన్స్ సిబ్బంది. వేసవి ప్రారంభ దశ కావడంతో నీటికోసం వస్తున్నాయా, వెదురు చెట్ల కోసం వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు.
గజరాజులతో జాగ్రత్త వహించాలి :
ఏనుగుల విధ్వంసంతో కూలిపోయిన వెదురుచెట్లను ఇప్పటికే పలు ప్రాంతాల్లో తొలగించారు టీటీడీ సిబ్బంది. మరికొన్ని ప్రాంతాల్లో వెదురు చెట్లను తొలగించేలా చర్యలు చేపడుతున్న టీటీడీ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అదే విధంగా ఘాట్రోడ్డులో కొండపైకి వచ్చే వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏనుగుల మంద అలజడి చేసే ప్రమాదం ఉండటంతో ఒంటరి, రాత్రి వేళల్లో కొండపైకి రావద్దని టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది సూచిస్తున్నారు.
Leave a Reply