భీమ్ న్యూస్ ప్రతినిధి కలువాయి (మార్చి 07) నెల్లూరు జిల్లా కలువాయి మండలం కలువాయిలో జనసేన నాయకులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెరంకొండ మనోహర అధ్యక్షతన కలువాయి బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి, జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఒకటి నుంచి 21 స్థానాలకు సంపాదించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని, ఇదే జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో పోటీ చేసి ఈరోజు ప్రతిపక్ష హోదా అయిన ఇవ్వండి అని స్థితికి దిగజారాడు అని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని అసెంబ్లీలో జరిగే సమావేశానికి హాజరై ప్రజా సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది, అంతేకానీ డివియేషన్ పాలిటిక్స్ వల్ల ప్రజలకు ఉపయోగ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చమ్మండి రాధమ్మ, వెంకటగిరి పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, ఉపాధ్యక్షుడు కోన రవిశంకర్, నియోజవర్గ నాయకులు జంపాల ప్రకాష్, అంజూరి చిరంజీవిలు, వెంకటేశ్వరరావు, ఎద్దుల రామ్మోహన్, పవన్ కుమార్, తోకల ప్రవళిక, నరేష్, రామ్ కిషోర్, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply